Site icon TeluguMirchi.com

వానలతో వాయిదాపడ్డ జనచైతన్య యాత్రలు !

Kodandaramరాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా.. తెలంగాణ జేఏసీ తలపెట్టిన జనచైతన్య యాత్రలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు జేఏసీ ఛైర్మెన్ కోదండరాం ఓ ప్రకటన చేశారు. అయితే, రేపు (గురువారం) జరగాల్సిన జేఏసీ ధర్నా ఆగష్టు 1కి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన జరుగుతుందన్న సమయంలో.. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని అన్నారు. కాగా, సచివాలయంలో తెలంగాణ ఫైళ్లను తగులబెడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.

Exit mobile version