Site icon TeluguMirchi.com

ప్రజా ప్రయోజనాల కోసమే ‘జనసేన’ !!

pavan press meetజనసేన పార్టీ నెమ్మదిగా తమ అజెండా రూపకల్పన వైపు అడుగులు వేస్తోంది. పార్టీ ప్రకటన సమయంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ అజెండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వుంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, జనసేన పార్టీ ఆఫీస్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అందులో పార్టీ రూపొంచపోయే అజెండాలోని కొన్ని అంశాలను పేర్కొంది. పార్టీ పరంగా పాటించే సెలవు దినాలను అజెండాగా వెల్లడించింది. ఆ వివరాలు..
1. భారత స్వాతంత్ర్య దినోత్సవం
2. భారత గణతంత్ర దినోత్సవం
3. విభజన తరవాత రెండు తెలుగు రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను సెలవులుగా ప్రకటిస్తామని ప్రకటన పేర్కొంది.

పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నట్లుగా జాతీయ భావాలున్న అంశాలకే ప్రాముఖ్యతను ఇచ్చే విధంగా సెలవు దినాలను కూడా ఎంపిక చేయడం విశేషం. ప్రాంతీయ అంశాలకు ప్రాధ్యతను ఇస్తే.. దేశ సమైక్యతకు భంగం కలిగే అవకాశాలున్నాయని జనసేన ప్రకటన తెలిపింది. మొత్తానికి.. పవన్ తన మార్క్ రాజకీయాన్ని మొదలెట్టేశాడు.

 

Exit mobile version