గందరగోళం సరికాదు: జానా

janaఅసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం సంతోషంగాఉందని మంత్రి జానారెడ్డి అన్నారు. బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని.. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే బీఏసీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. టీ బిల్లుపై అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. విభజన ప్రక్రియ ఆలస్యమైతే ఇరుప్రాంతాల్లో భావోద్వేగాలు, ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.