Site icon TeluguMirchi.com

సీఎం వ్యాఖ్యలు బాధాకరం: జానారెడ్డి

jana reddyరాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని పునరాలోచించుకోవాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు విబాధాకరమని మంత్రి జానారెడ్డి అన్నారు. సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జానారెడ్డి.. కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విభజన ప్రకటన అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. తెలంగాణలో పర్యటించిన ప్రతిసారీ అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యమని సీఎం చెప్పారని, శాసనసభలో కూడా ప్రకటించారన్నారు. అలాంటప్పుడు ఇప్పుడిలా మాట్లాడటం సరికాదని సూచించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం సహా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసని, సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలే తప్ప.. అనుమానాలు కలిగేలా ప్రవర్తించొద్దని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version