విభజన వద్దు.. సమైక్యమే ముద్దు..!

jagga-reddyతెలంగాణ వాదులకు భిన్నంగా మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి మరోసారి సమైక్యనాదం ఆలపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే నష్టమని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలనే అభివృద్ధి సాధ్యమని..ఉద్యమాల ముసుగులో దోపీడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులలో సమైక్యరాగం ఆలపించే ఏకైక వ్యక్తిగా జగ్గారెడ్డి ముద్రపడిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా సపరేట్ రాగం ఆలపిస్తే.. జగ్గారెడ్డి మాత్రం సమైక్యనాదం ఆలపించడం ఇక్కడ గమనించదగ్గ విషయమే. మరి జగ్గారెడ్డి లేఖపై అమ్మ సోనియా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.