సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు: జగన్

jagan kiranఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం గురించి దేశ వ్యాప్తంగా నేతలను కలిసి న్యాయం చేయమని అడిగామని, తెలుగు ప్రజలందరూ సమైక్యంగా ఉండేందుకు ప్రతి రోజూ పార్లమెంటు లో పోరాటం చేశామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెప్పారు. జగన్ ఈ రోజు మీడియా తో మాట్లాడుతూ…పార్టీలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోసం అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇక సిఎం కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న విభజన వాదని విమర్శించారు. అవకాశం ఉన్నా సీఎం అసెంబ్లీని సమావేశపరచి, సమైక్య తీర్మానం చేయలేదని చెప్పారు. కిరణ్ సమైక్యానికి కట్టుబడి వున్ననంటూ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.