రాష్ట్రపతిని కలవనున్న జగన్ బృందం!

jaganశీతాకాల విడిదిలో వున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం 11.30కు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రణబ్ తో సమావేశమవుతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరుతూ.. రాష్ట్రపతికి జగన్ బృందం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, శీతాకాల విడదిలో వున్న రాష్ట్రపతిని గతకొన్నిరోజులుగా పలువురు నేతలు సమావేశమవుతూ వస్తున్న విషయం తెలిసిందే.