జగన్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా…!

ys-jaganaవైకాపా అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాపడింది. జగన్ అక్రమాస్తులకేసుకు సంబంధించి జగన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పెట్ట్టుకున్న బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేనందున విచారణను ఈ నెల 29కి  వాయిదా వేస్తున్నట్లు న్యాయంస్థానం పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి సీబీఐకి నోటీసులు జారీ చేయాలన్న జగన్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించిన వాదనలు వినకుండా సీబీఐకి నోటీసులు జారీ చేసేదిలేదని కోర్టు స్పష్టం చేసింది. జగన్ తోపాటుగా నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ పై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది. దీంతో..  ఏప్రిల్ లో జగన్ బెయిల్ పై బయటకు వస్త్తాడని భావిస్తున్న వైకాపా కార్యకర్తల ఆశలు అడియాశలయ్యాయి.