హస్తినాలో.. జేఏసీ నేతల అరెస్ట్ !

t-jacతెలంగాణపై ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమయిన నేపథ్యంలో… సీమాంధ్ర, సమైక్యాంధ్ర జేఏసీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తెలంగాణపై కీలక భేటీ జరుగుతున్న నేపథ్యంలో.. జేఏసీ నేతలు ఫ్లకార్డ్స్ ప్రదర్శిస్తూ.. ఎవరికివారు గుమిగూడి ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా వారిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్ కమిటీ సమావేశమయిన సమయంలో విద్యార్థి నేతలు లోపలికి దూసుకెళ్లే అవకాశం ఉన్నందున పోలీసులు జేఏసీ నేతల అరెస్ట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.