భాజాపాలో చేరనున్న రజినీకాంత్.. !!

j9nlbpph

సినీ స్టార్లంతా మోడీకి జైకొడుతున్నారు. మార్పు కావాలంటే మోడీ రావాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాన్, నాగార్జునలు స్వయంగా మోడీని కలసి తమ మద్దతును తెలిపారు. తాజాగా, సౌత్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా మోడీతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారట. రేపు (ఆదివారం) రజీని మోడితో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ప్రముఖ పత్రికా సంపాదకుడు చో రామస్వామి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో.. రజినీ భాజాపాలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరీ.. రజినీ నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. ?? లేదా.. పవన్, నాగార్జునల లాగా కేవలం మోడీకి మద్దతు ప్రకటిస్తారా..?? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి.. రజినీ రాజకీయ ప్రవేశంపై నెలకొన్ని సంద్గిత వీడాలంటే.. మరో 24గంటలు ఆగాల్సిందే..