తెదేపా.. ’గంటా’!

gantaతెదేపా తీర్థం పుచ్చుకోవడానికి పలువురు సీమాంధ్ర మంత్రులు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. మంత్రులు గంటా, ఏరాసు, టీజీలు సైకిల్ ఎక్కడానికి సిద్ధమయినట్లు సమాచారం. తాజాగా,  టీజీ వెంకటేష్ తెదేపా అధినేత చంద్రబాబు తో సమావేశమయి మంతనాలు జరుపుతున్నారు. అయితే, మంత్రులు తెదేపాలో చేరడంపై ఇప్పటికే చర్చలు ముగిశాయని తెదేపా వర్గాలు అంటున్నాయి. మరోవైపు గంటా ఏరాసు, టీజీలతో తెదేపా ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ సమావేశమయ్యారు. వీరే కాకుండా పసుపుకండువా కప్పుకోవడానికి సీమాంధ్ర ప్రాంతం నుంచి పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.