Site icon TeluguMirchi.com

చంద్ర బాబు తప్పు చేస్తున్నారా !

NCBN

ఎంతో తెలివైన నాయకుడిగా పేరుపొందిన చంద్ర బాబు తప్పు చేస్తున్నారా ? ఎన్ టి అర్ విగ్రహ అవిష్కరణ సభపై రాజకీయం చేయడం ద్వారా ఆయన కేంద్ర మంత్రి పురందరేశ్వరి కి గొప్పదనం ఆపాదించి పెడుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఎన్నికల ముందు పురంద్రేశ్వరి ఎన్ టి అర్ విగ్రహాన్ని అవిష్కరించడం ద్వారా కాంగ్రేస్ కు తనకు ప్లస్ అయ్యే లా పధకం రచించారు . అయితే ఈ సభకు వెళితే ఒక సమస్య వెళ్ళ కుంటె మరో సమస్య అన్న ఆలోచనో పడ్డారు చంద్రబాబు . ఎక్కడ, ఎవరు ఐడియా ఇచ్చారో కాని పిలుపు అందలేదన్న రాద్ధాంతం మొదలు పెట్టారు. దీంతో విగ్రహం వ్యవహారం క్రెడిట్ అంత పురంద్రేశ్వరి కి వెళ్ళిపోయింది . అలా కాకుండా పిలుపు రాకున్నా తానూ వెళ్తానని , ఎన్ టి అర్ కోసం ఎన్ని అవమానాలైనా పడతానని చెప్పి ఉంటె బాబు ఇమేజ్ పెరిగెది. ఇప్పటికే వెన్నుపోటు అన్న అపప్రధ ఉండనే వుంది. ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ సభకు వెళ్ళక పోవడం ద్వారా, రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్టీఆర్ బొమ్మని వాడుకుంటే అడ్డుకునే హక్కును బాబు కోల్పోవలసి వస్తుంది.

ఇదిలా ఉంటె ఎవరు కాదన్నా ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి . ఆమెను ఖచ్చితంగా అహ్వనించాలి. అలా చేయక పోవడం ద్వారా పురందరేశ్వరి తప్పు చేస్తున్నారన్నది బలపడింది. ఇలాంటప్పుడు బాబు ఢిల్లీ వెళ్లి, ఆ తరువాత ఈ వ్యవహారం పై రాజకీయం చేస్తే బాగుండేది అని పార్టీని అభిమానించే వారు కూడా అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version