Site icon TeluguMirchi.com

ఐపీఎల్ కాదు.. గ్యాంబ్లింగ్

ipl-spot-fixing-yeswanth-siఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఐపీఎల్ మొదటి నుండి జూదానికి నెలవుగా మారిందని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. ఐపీల్ లో క్రికెట్ కన్నా గ్యాంబ్లింగ్ ఎక్కువ జరుగుతుందని ఆయన ఆరోపించారు. యశ్వంత్ ఈరోజు (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ కొంతమంది ఆటగాళ్ళకు, బుకీలకే పరిమితం కాలేదని, అంతటా వ్యాపించి ఉందన్నారు. ఫిక్సింగ్ పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు.

Exit mobile version