Site icon TeluguMirchi.com

జగన్ కేసులో దర్యాప్తు పూర్తి !

jaganజగన్ అక్రమాస్తుల కేసులో విచారణ పూర్తయిందని ఈరోజు (సోమవారం) సిబిఐ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. అయితే, ఇందూ ప్రాజెక్ట్స్‌కు చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని.. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించామని సీబీఐ కోర్టుకు విన్నవించింది. త్వరలో దీనికి సంబంధించిన దర్యాప్తు వివరాలను కోర్టుకు సమర్పిస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. 9,10 ఛార్జీషీట్ల వ్యవహారంలో విచారణ సాగుతుందని,త్వరలోనే కోర్టుకు తుది నివేదిక ఇస్తామని పేర్కొంది. అయితే ఈ కేసులో ఐటీ, ఈడీలు వేర్వేరుగా దర్యాప్తు కొనసాగిస్తాయని సీబీఐ తెలిపింది.

Exit mobile version