Site icon TeluguMirchi.com

నాకు తెలియదు..!

diggiకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడిగా నియమితులైన మొదటిరోజు నుండే తెలంగాణ అంశాన్ని ఉరుకులు పెడుతున్నాడు దిగ్విజయ్ సింగ్. రాష్ట్రానికి వచ్చిన మొదటి పర్యటనతోనే తెలంగాణ అంశాన్ని తేల్చేస్తాం.. రోడ్ మ్యాప్ లతో రండంటూ త్రిమూర్తులకు ఆహ్వానం పంపి తెలంగాణ తుట్టేను కదిపిన చరిత్ర డిగ్గీరాజాది. అలాంటిది తెలంగాణపై జరిగే కీలక సీడబ్ల్యూసీ సమావేశంలో వున్న అజెండా గురించి తెలియదట. రేపు జరగబోయే సీడబ్య్లూసీ సమావేశంపై డిగ్గీరాజా విలేకరులతో మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ అజెండా గురించి నాకు తెలియదని అన్నారు. అలాగే రాష్ట్రాన్ని విభజిస్తే.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని విషయం కూడా తనకు తెలియదని మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు మన ఢిగ్గీరాజా. పనిలో పనిగా టీడీపీ హయాంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం ప్రయత్నించారని, కానీ అప్పట్లో ఎన్డీయే ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. అంతే మరీ తెలిసినవి చెప్పకున్నా.. తెలియనవి చెప్పాలిగా..!

Exit mobile version