Site icon TeluguMirchi.com

మల్లేష్ కుటుంబానికి హోం మంత్రి సబిత పరామర్శ

sabithaహోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం శంషాబాద్ మండలం కవేలిగూడలో దోపిడి దొంగల దాడిలో మరణించిన మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. దొంగల దాడిలో మృతి చెందిన మల్లేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని హోం మంత్రి  ప్రకటించారు.  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటామని, ఔట్ పోస్టులు ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే….. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడలో గొర్రెలను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముగ్గురు దోపిడీ దొంగలు వీరంగం చేశారు.ఇంటి యజమానిని కొట్టి చంపారు. ఆ తరువాత ఇన్నోవా కారులో పారిపోతుండగా, వారిని మల్లేష్ అనే వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అతనిని కారుతో ఢీకొట్టారు. అయితే మల్లేష్ ను హతమార్చి పారిపోతున్న మగ్గురు దొంగల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయారు.

Exit mobile version