Site icon TeluguMirchi.com

ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ భండారీ మృతి

romesh_bandariఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్  రమేష్ భండారీ తీవ్ర అనారోగ్యం కారణంగా ఢిల్లీలో నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయనకు 85 ఏళ్లు. పాంక్రియాటిక్ కేన్సర్ తో బాధపడుతున్న భండారీ మూడు వారాలుగా గుర్గావ్ లోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. భండారీ గతంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత త్రిపుర, గోవా రాష్ట్రాలకు కూడా గవర్నర్ గా వ్యవహరించారు.

Exit mobile version