Site icon TeluguMirchi.com

అక్బరుద్దీన్ పై నమోదుకు కోర్టు ఆదేశం

akbaruddin-owaisiవివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై వెంకటేశ్ గౌడ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ప్రజలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని ఓయూ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా అంతకు ముందు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అందరూ సమానమే అని అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన వారిపై చర్యలుంటాయన్నారు. హిందూ దేవుళ్లపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వివాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని, దీనిపై ఇప్పటికే కేసు నమోదైనందున అది న్యాయస్థాన పరిథిలోకి వస్తుందని చెప్పారు. ఇప్పటికే బీజేపీ తో పాటు అనేక పార్టీలకు చెందిన రాజకీయనాయకులు కూడా అక్బరుద్దీన్ వివాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version