Site icon TeluguMirchi.com

బొత్సకు అధిష్టానం క్లాస్…?

botsaకాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ చీఫ్ బొత్స సత్యానారాయణకు సీరియస్ గా క్లాస్ తీసుకుందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా సీడబ్లూసీ నిర్ణయాన్ని ఎందుకు ధిక్కరించాల్సి వచ్చిందని, తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా సంతకాలు సేకరించారని అధిష్ఠానం పెద్దలు ప్రశ్నించినట్లు సమాచారం. కాస్త ఆగ్రహంతో.. అధిష్టానం అడిగిన ప్రశ్నలకు నివ్వరపోవడమే బొత్స వంతైనట్లు తెలుస్తోంది. కనీసం మీ పార్టీ నేతలతో ముందే చర్చించకుండా ఎందుకు ప్రకటించారని.. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని బీజేపీ, అన్నా డీఎంకే, ఇతర పార్టీలు అడుగుతున్నాయని అధిష్ఠానం బొత్సపై ఆసహనం వ్యక్తం చేసినట్లు వినికిడి. మీ వైఖరి వల్ల అధిష్టానం అప్రతిష్టపాలు కావాల్సి వచ్చిందని బొత్సపై మండిపడినట్లు సమాచారం.

Exit mobile version