Site icon TeluguMirchi.com

లోక్ సభ లో హైఎలర్ట్ !

meera kumarపార్లమెంటులో రేపు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో ఊహించలేమని, ఏ సంఘటన ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని లోక్ సభ సిబ్బందిని స్పీకర్ మీరాకుమార్ అప్రమత్తం చేశారు. సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఆత్మాహుతి చేసుకుంటానని ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యలపై లోక్ సభలో విచారణ జరిగింది. దాంతో స్పీకర్ మీరాకుమార్ ముందు జాగ్రత్త చర్యగా లోక్ సభ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెడితే.. వెల్ లోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంటాను అని సబ్బం హరి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version