పరువునష్టం దావా వేస్తా !

pawan kalyan
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న పవన్ నిరాధరమైన వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ హెచ్చరించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకెలాంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టంచేశారు . తనపై చౌకబారు ఆరోపణలు చేస్తే సహించనన్నారు. పవన్ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్న ఆయన, 24 గంటల్లో ఆధారాలు చూపాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.