Site icon TeluguMirchi.com

యూటీ అంటే ఒప్పుకోం : హరీష్

harish-raoహైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, తమకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న మనస్తత్వంతో సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తలలు తెగిపడిన హైదరాబాద్ ను వదులుకోమని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమనే విషయాన్ని మరవకూడదని.. కేంద్రం హద్దులు మీరి నిర్ణయాలు తీసుకుంటే.. చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Exit mobile version