హరీష్ రావు హాట్ కామెంట్స్ !!

harish raoకేంద్రమంత్రి జైరాం రమేశ్ పై మండి పడ్డారు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉన్న సయోధ్యను జైరాం చెడగొడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జైరాం రమేశ్ మాటలు నోటితో మాట్లాడి… నొసటితో వెక్కిరించినట్లుగా ఉన్నాయన్నారు. జైరాం రమేష్ మాటలు, చేష్టలు తెలంగాణ కాంగ్రెస్‌ను నిండా ముంచేస్తాయని, కాంగ్రెస్, తెరాస మధ్య సయోధ్యను జైరాం చెడగొడుతున్నారని పేర్కొన్నారు. జైరాం రమేశ్ తెలంగాణ పాలిట విలన్‌గా హరీశ్‌రావు అభివర్ణించారు. పోలవరం విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి జైరాం రమేశ్ కారాణమని ఆరోపించారు. జైరాం రమేష్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ, సోనియాగాంధీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.