హరికృష్ణ రాజీనామా

harikarishnaరాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నందమూరి హరికృష్ణ ఆదివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్కు పంపించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ .. రాష్ట్ర విభజన సమంజసం కాదన్నారు. మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు తాను, తమ పార్టీ వ్యతిరేకం కాదని అయితే, విభజన జరిగిన తీరును నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందు అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో తెలుసుకోలేదని విమర్శించారు.