హరికృష్ణ రాజీనామా ఆమోదం

harikrishnaరాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలని, వారిని విడదీయొద్దని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ హరికృష్ణ ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే రాజీనామా చేసిన హరికృష్ణ ఈసారి నేరుగా స్పీకర్ ఫార్మాట్లో లేఖ అందించారు. కాగ హరికృష్ణ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సమైక్యవాదానికి మద్దతు గా చేసిన రాజీనామాల్లో ఆమోదం పోదిందిన మొదటి రాజీనామా ఇదే కావడం విశేషం.