బావతో భేటీ అయిన బావమరిది

NCBN-Harikrishna“వస్తున్నా.. మీకోసం” పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు ఎంపీ నందమూరి హరికృష్ణ ఈరోజు (సోమవారం) ఉదయం భేటీ అయ్యారు. బాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రవేశించనుంది. అయితే కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కనువిప్పు యాత్ర పేరుతో బాబు పాదయాత్రను అడ్దుకుంటామన్న నేపథ్యంలో… వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం హరికృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ… తన తండ్రి ఎన్టీఆర్ సొంత జిల్లాలో పాదయాత్ర చేస్తున్నందున బాబును కలిసినట్లు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం బాబు యాత్రను అడ్డుకోవటం సరికాదన్నారు. ప్రజల ఆమోదంతోనే పాదయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. పాదయాత్రను లగడపాటి రాజగోపాల్ అడ్డుకుంటే కార్యకర్తలే బుద్ధి చెబుతారని తెలిపారు.