హరిత ఫ్లెమింగో ఉత్సవాలను ప్రారంభించిన చిరు

Chirenjeeviసూళ్లూరు పేటలో ‘హరిత ఫ్లెమింగో’ ఉత్సవాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు. ఈ ఉత్సవాలు నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… నెల్లూరు తన జన్మభూమి అన్నారు. మత్స్యకారులకు ఎలాంటి సమస్య రానివ్వనని చిరు హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో అభివృద్ధి టూరిజంపైనే ఆధారపడి ఉందని, మనదేశంలో కూడా టూరిజంను ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని చిరంజీవి అన్నారు. ఈ హరిత ఫ్లెమింగో ఉత్సవాల ప్రారంభత్సోవానికి మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, వట్టి వసంత్ కుమార్ హాజరయ్యారు.