Site icon TeluguMirchi.com

కేంద్రానికి చేరిన గవర్నర్ నివేదిక!!

governorరాష్ట్ర పరిస్థితులపై గవర్నర్ పంపించిన నివేదిక కేంద్రానికి అందింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అచేతన స్థితికి చేరుకున్నందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే విధించడమే మంచిదని గవర్నర్ సూచించినట్లు సమాచారం. మరోవైపు ఈరోజు ఉదయం సమావేశమయిన కేంద్ర కేబినేట్ టీ-బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామా వ్యవహారంపై విస్త్రుతంగా చర్చ జరిపినట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్ నరసింహన్ అందించిన నివేదిక అందినట్లు కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Exit mobile version