ఢిల్లీకి.. గవర్నర్ !!

delhi (1)రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు (మంగళవారం) ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం గవర్నర్ హస్తినాకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో.. గవర్నర్ ఢిల్లీ టూర్ మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, హోంమంత్రి షిండే, రక్షణశాఖ మంత్రి ఆంటోని.. తదితర ప్రముఖులతో గవర్నర్ భేటీ కానున్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియతో పాటుగా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రపతి పాలన దృష్ట్యా పరిపాలన కోసం గవర్నర్ కార్యాలయంలో ఇద్దరు సలహాదారుల నియామకం గురించి హోంమంత్రితో చర్చించనున్నట్టు సమాచారం. కాగా, శుక్రవారం గవర్నర్ ఢిల్లీలోనే వుండనున్నారు.