Site icon TeluguMirchi.com

ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్ ను తిప్పి పంపిన గవర్నర్

eslnarasimhan-dharmanaమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ విషయంలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్ పై మరోసారి న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సూచించారు. ఈ ఫైల్ ను రెండ్రోజుల క్రితమే ప్రభుత్వానికి తిప్పి పంపినట్లు సమాచారం. మాజీ మంత్రి మోపిదేవి, ధర్మానలకు ఛార్జిషీట్ లో పేర్కొన్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) (సి) (డి)ల కింద విచారణకు స్వీకరించాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోపై సీబీఐ కోర్టు నిన్న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version