గవర్నర్ నరసింహన్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు. రాష్ట్రపతి పాలనలో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కిరణ్ పాలనలో చివరి రెండు నెలల నిర్ణయాలను సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ చేసిన బదిలీలను తిరగదోడుతున్నారు. తన పేషీలోని ఐఏఎస్ అధికారులను కీలక స్థానాలకు బదిలీ చేయగా, గవర్నర్ వారందరినీ అక్కడి నుండి ఇతర స్థానాలకు బదిలీ చేశారు. ఈ మేరకు గవర్నర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా కిరణ్ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ పూర్తిగా సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి.. గవర్నర్ దూకుడు కొనసాగుతుందన్న మాట.