సీమాంధ్ర టీచర్లకు శుభవార్త !

seemandhra teachersసమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న టీచర్లుకు శుభవార్త. ఉద్యమంలో పాల్గొన్న రోజులను పని దినాలుగా పరిగణిస్తూ.. ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో.. 70రోజులకు పైగా ఉద్యమంలో పాల్గొని, విధులకు హాజరుకాని టీచర్లకు కూడా జీతం అందనుంది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం
చేస్తున్నారు. అయితే, సెలవు దినాలను కూడా పనిదినాలుగా భావించి విద్యార్థుల సెలబస్ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.