జీవోఎం నివేదిక ఖరారు – డిసెంబర్ 4న కేబినేట్ ముందుకు

shindeరాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికను ఖరారు చేసింది. నిన్న దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయిన జీవోఎం ఈరోజు మరోసారి సమావేశమయి నివేదికకు తుది మెరుగులు దిద్దింది. సమావేశం అనంతరం జీవోఎంకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే విలేకరులతో మాట్లాడుతూ.. డిసెంబర్ 4వ తేదీన జీవోఎం నివేదిక కేబినేట్ ముందుకు వస్తోందని.. అదే రోజున దీనిపై కేంద్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తోందని షిండే మరోసారి స్పష్టం చేశారు. తాజా షిండే ప్రకటనతో.. శీతాకాల సమావేశాల్లో టీ-బిల్లు వస్తుందా..? రాదా.. ? అనే ఉత్కంఠకు తెరపడినట్లయింది.