Site icon TeluguMirchi.com

మళ్లీ ఢిల్లీ ’గంటా’..!

Gantaసీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మళ్లీ ఢిల్లీ గంట కొట్టారు. ఈ నెల 24, 25 న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, దిగ్విజయ్ ను కలుస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. గంటా ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ఆంటోని కమిటీతో పాటు కేబినేట్ నోట్ పై మాట మార్చింది ఢిల్లీ పెద్దలేనని మండిపడ్డారు. విభజన విషయంలో.. కొంత మంది సీమాంధ్ర కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో.. మరోసారి సీమాంధ్ర నేతలు ఢిల్లీవెళ్లి సమైక్య కోసం ప్రయత్నాలు చేస్తామని గంటా తెలియజేశారు.

Exit mobile version