Site icon TeluguMirchi.com

డబ్బే రాజకీయం కాదు!

gadde-టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ తాజాగా విలేకర్లతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో డబ్బు ప్రధానమని…. అయితే డబ్బే రాజకీయం కాదని అభిప్రాయ పడ్డారు. టీడీపీ తరఫున ఎంపీ సీటు ఇస్తే తాను డబ్బు ఖర్చు పెడతానని వ్యాఖ్యానించారు.ఎంపీ సీటు తన డిమాండ్ అని… అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటానని గద్దె తెలిపారు. గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గద్దె రామ్మోహన్ ఈసారి మాత్రం విజయవాడ ఎంపీ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.

Exit mobile version