Site icon TeluguMirchi.com

రాజధాని లో ఫ్రీ ‘వైఫై ‘

Free-WiFiగతంలో కెటిఆర్ చెప్పినంటు రాజధాని హైదరాబాద్‌ లో ఫ్రీ వైఫై ను ఈరోజు శ్రీకారం చేపట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అయిననుండి పలు సంక్షేమ పధకాలతో ప్రజల ఆకర్షిస్తూ వస్తున్న తెలంగాణ సర్కారు ఇప్పుడు హైదరాబాద్ యువతకు కూడా ఫ్రీ వైఫై తో దగ్గరయ్యింది.

హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గురువారం సాయంత్రం 5.15 గంటలకు హోటల్ మారియట్‌లో ఉచిత వైఫై పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఒకేసారి 2,500 మంది లాగిన్ కావచ్చని అధికారులు తెలిపారు.2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఉచిత వైఫై సేవలు లభిస్తాయని, ఒక్కో పౌరుడు 30 నిమిషాలు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని తెలిపారు.

Exit mobile version