Site icon TeluguMirchi.com

ఒడిశా మాజీ మంత్రి అరెస్ట్ !

mohantyవరకట్న వేధింపుల కేసులో ఒడిశా న్యాయశాఖ మాజీ మంత్రి రఘునాథ్ మొహంతి, ఆయన భార్యని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా తనను కట్నం కోసం అత్తామామ, భర్త, కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ రఘునాథ్ మొహంతి కోడలు బర్షా సోని మొహంతి బాలాసోర్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో.. రెండు వారాలుగా తప్పించుకొని తిరుగుతున్న రఘునాథ్ ను కోల్ కత్తాలో పోలీసులు ఈరోజు (శనివారం) ఉదయం అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని కోడలు బార్సా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మొహంతి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే రఘునాథ్‌ మొహంతి కుమారుడు రాజశ్రీ మొహంతిని పోలీసులు ఈనెల 17న అరెస్ట్ చేశారు.

Exit mobile version