‘గ్రేటర్ రాయలసీమ’ను ఏర్పాటు చేయండి !

SONIA-GANDHI (2)కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో.. కర్నూలు జిల్లా నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ విభజన అనివార్యమైతే నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటుచేయాలని కోరారు. ఈ మేరకు సోనియాకు నేతలు వినతిపత్రాన్ని కూడా అందజేశారు. అధినేత్రి సోనియాను కలిసిన వారిలో ఎస్సీవై రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామి, మురళీకృష్ణ లు ఉన్నారు