Site icon TeluguMirchi.com

పెద్దల సభకు ఆహార భద్రత, భూసేకరణ బిల్లులు

RAJYA_SABHAయూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా రూపొందించిన జాతీయ ఆహార భద్రత, భూసేకరణ బిల్లులు నేడు రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈ బిల్లులు ఇప్పటికే పలు సవరణలు, సుదీర్ఘ చర్చ అనంతరం లోక్ సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లులపై ఈరోజు పెద్దల సభలోనూ సుదీర్ఘంగా చర్చ జరగనుంది. అయితే, ఆహార భద్రత బిల్లుకు సవరణలు ప్రతిపాదించాలని సీపీఐ భావిస్తోంది. మరోవైపు, సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు కూడా ఈరోజు లోక్ సభ ముందుకు రానుంది. ఈ చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలు రాకుండా బిల్లులో సవరణ లు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version