Site icon TeluguMirchi.com

లోక్ సభలో ‘ఆహార భద్రత బిల్లు’

lokhsabhaఆహార భద్రత బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈరోజు (బుధవారం) లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విప్ కూడా జారీ చేసింది. బిల్లుపై వచ్చేవారం సభ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ’ఆహార భద్రతబిల్లు’ను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. సభలో బిల్లు ప్రవేశపెట్టినంతరం సభ రేపటికి వాయిదా పడింది.

Exit mobile version