’ఆహార భద్రత ఆర్డినెన్స్’పై పిల్ కొట్టివేత

SCయూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న “ఆహార భద్రత ఆర్డినెన్స్” పై దాఖలయిన పిల్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీనిపై పిటిషనరు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆహార భద్రత చట్టం వెనుక రాజకీయ లబ్ది, దుర్వినియోగం ఉందంటూ న్యాయవాది ఎమ్ ఎల్ శర్మ వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిల్ ను కొట్టేసింది.