సంయమనం పాటించండి : సీఎం

cm kiranరాష్ట్ర విభజకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు ఊపందుకున్నాయి. రెండో రోజు కూడా సీమాంధ్ర జిల్లాలలో ఆందోళనలు కొనసాగతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌనం వీడారు. సీమాంధ్రలో శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టారు. సీమాంధ్ర జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడాలని డిజీపీ, జిల్లా కలెక్టర్లను, ఎస్ పిలను ఆదేశించారు. మరోవైపు సంయమనం పాటించాలని సీమాంధ్ర ప్రజలను సీఎం కోరారు. బుల్లెట్లు వాడకుండా ఆందోళనకారులను నియత్రించాలని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తులకు నష్టం జరుగకుండా అడ్డుకోవాలని సీఎం పోలీసులు పలు సూచనలు చేశారు