యెన్నంపై కన్నెర్ర!!

yennamమహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డిపై భాజాపా అధిష్టానం కన్నెర్ర చేసింది. సీనియర్ నేత వెంకయ్య నాయుడిపై యెన్నం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై యెన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే పార్టీ నుండి అతన్ని బహిష్కరించాలని రాష్ట్రపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆదేశించిందట. కాగా, తెలంగాణపై వెంకయ్య వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల యెన్నం తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.