బొత్స, జేసీ ల ఫైటింగ్ !

bosta jc diwakar reddyమాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి , పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ ల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీకి వ్యతిరేకంగా చైతన్య రాజును దివాకరరెడ్డి బలపరస్తుండడంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే పార్టీని విడిచి మాట్లాడాలని..లాలూచీ రాజకీయాలు చేయవద్దని బొత్స వ్యాఖ్యానించగా… వెళ్లాలనుకుంటే నువ్వే పో అని జేసీ సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో లాలూచీ పడింది నీవేనంటూ బొత్సపై జేసీ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా అసహం చెందిన జెసీ ఓ దశలో బొత్సపై చేయి ఎత్తారని సమాచారం. ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద మంగళవారం బొత్స, జేసీల మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకుంది.