అనర్హత పిటిషన్లపై స్వీకర్ విచారణ

n manoharఅవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై స్వీకర్ నాదెండ్ల మనోహర్ ఈరోజు విచారణ ప్రారంభించారు. టీడీఎల్పీ ధూళిపాళ్ల నరేంద్ర ఈ విచారణకు హాజరయ్యారు. కాగా, విప్ ధిక్కరించిన తెదేపా ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు హాజరుకాలేదు. అయితే, పార్టీ విప్ ధిక్కరించిన 9 మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి పలువురు తెదేపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయా పార్టీల విప్ ను ధిక్కరించిన విషయం తెలిసిందే.