మాజీ మంత్రి ధర్మాన రాజీనామా !

dharmanaతెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. సరైన సమయంలో సరైన విధంగా సీఎం స్పందించారని ఆయన చెప్పుకొచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన ప్రకటించారు. అయితే, ధర్మానతో పాటుగా ఎమ్మెల్యేలు జగన్నాథం, సత్యవతి, భారతిలు కూడా రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు రావడం వలన గతంలో.. ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.