అందరూ సహకరించాలి : డీఎస్

D.-srinivasతెలంగాణపై నిర్ణయం జరిగిపోయాక అందరూ సహకరించాలే తప్ప విద్వేషాలకు పోకూడదని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ సూచించారు. ఈరోజు డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ..  ముందు విభజన నిర్ణయాన్ని అంగీకరిస్తే ఇతర సమస్యల గురించి చర్చిద్దామన్నారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుందని, విభజన ప్రక్రియ ఆగిపోయిందన్న వార్తలు అవాస్తవమని డీఎస్ వెల్లడించారు. ఏపీ ఎన్జీవోలు శాంతియుతంగా తమ వాదనలు చెప్పుకునే హక్కుందని ఆయన అన్నారు. అయితే, ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతిని ఇచ్చే విషయం ప్రభుత్వం చూసుకుంటుందని డీఎస్ అన్నారు.