నేడే నోటిఫికేషన్‌ !

1panel3aసార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేవనుంది. నేడు(బుధవారం) తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఇవే చిట్టచివరివి. రాష్ట్రంలో రెండు దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశగా తెలంగాణలో, రెండవ దశలో సీమాంధ్రలో ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, సార్వత్రిక సమరానికి గంట మ్రోగనుండటంతో.. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యాయి.