తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న నేపథ్యంలో.. టీ-కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలలో కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పి తెరాసలో చేరడానికి సిద్ధమవుతుండడంతో.. డి.శ్రీనివాస్ ను పిసిసి అధ్యక్షునిగా నియమిస్తే తెలంగాణ ప్రాంతాని ప్రాధాన్యతనిచ్చినట్లు అవుతుందని, దీని ద్వారా కాంగ్రెస్ నుండి తెరాస వలసలను కొంతవరకు అడ్డుకట్టవేయవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పీసీసీ అధ్యక్షుడు బొత్స, సీఎం కిరణ్ ల మధ్య సమన్వయ లోపం, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో.. అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి మార్పుకు మొగ్గు చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో సీనియర్ నేత కె. కేశవరావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినప్పటికినీ ఆయన కొంతకాలంగా టీఆర్ ఎస్ కు కోవర్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. అధిష్టానం డి. శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో డి. శ్రీనివాస్ కు పీసీసీ అధ్యక్షుడిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉందని కాంగ్రెస్ పెద్దల భావిస్తున్నట్లు సమాచారం.