కాంగ్రెస్ ఫ్యూచర్ కి ఢోకా లేదు : షిండే

shiende

కాంగ్రెస్ వ్యూచర్ కి ఢోకా లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) షిండే విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని అన్నారు. ఇక
ఢిల్లీ పరిస్థితి గురించి లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై షిండే స్పందిస్తూ.. ప్రస్తుతం టీ-బిల్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గర వుందని.. బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తెలియజేసిన అనంతరం ముందుకెళతామని పేర్కొన్నారు.